Wednesday, July 3, 2013

టి.డి.పి. సైలెంట్... టి.ఆర్..ఎస్.లో టెన్షన్...

హైదరాబాద్, జులై 3:  తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌లో పరిణామాలపై ఎవరూ నోరు మెదపవద్దని పార్టీ నేతలను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న హడావుడిపై ఇరు ప్రాంతాల టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిణామాలు ఏ రకంగా చూసినా టీడీపీకే తీవ్ర నష్టం తప్పదన్న అంచనాకు ఆ పార్టీ నేతలొస్తున్నారు.  ఇవన్నీ ఒక పథకంలో భాగమేనని, స్థానిక ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ అంశాన్ని కేంద్రం అటకెక్కిస్తుందని  చంద్రబాబు పార్టీ సీనియర్లతో వ్యాఖ్యానించినట్లు  సమాచారం.
టి.ఆర్..ఎస్.లో టెన్షన్... 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీలో తాజా గా మొదలైన హడావుడి ఆంతర్యమేమిటో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు అంతుచిక్కటం లేదు. అధికార పార్టీ నేతల హడావుడి కేవలం ఎన్నికల స్టంటా? లేదంటే రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయా? అన్నదానిపై ఒక అంచనాకు రాలేక మల్లగుల్లాలు పడుతున్నారు.  కాంగ్రెస్ తమ పార్టీని టార్గెట్ చేసుకునిగానీ వ్యవహరిస్తోందా? అన్న అనుమానాలు కూడా టీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో గతంలో అనేకసార్లు తమ అధినేత కేసీఆర్‌తో మాట్లాడిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఆ అంశంపై ఎలాంటి సంప్రదింపులు జరపపోవటంపై టీఆర్ ఎస్‌లో చర్చ జరుగుతోంది. గతంలో ఢిల్లీ పెద్దలు తనతో టచ్‌లో ఉన్నారంటూ పలుమార్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మౌనంగా ఉండడం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...