Tuesday, July 23, 2013

వస్తా...ఎల్లొస్తా...కానీ మరి రాదు....

చెన్నై, జులై 23 : ప్రముఖ నటి మంజుల (60) మంగళవారం కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడలో సుమారు వంద చిత్రాల్లో పైగా నటించిన మంజుల... ప్రముఖ నటుడు విజయ్ కుమార్ సతీమణి. టాలీవుడ్‌ సూపర్‌స్టార్లు ఎన్టీఆర్‌, అక్కినేని, కృష్ణ, శోభన్‌ బాబుతో పాటు తమిళ దిగ్గజాలు శివాజీ గణేషన్‌, యంజీ రామచంద్రన్‌, జెమిని గణేషన్‌ నటించిన అనేక సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. 1969లో తమిళ సినిమా 'శాంతి నిలయం'తో బాలనటిగా మంజుల సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో చిన్నప్పటి జెమినీ గణేషన్‌ పాత్రలో నటించారు. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా జై-జవాన్‌. కృష్ణ హీరోగా నటించిన మాయదారి మల్లిగాడు సినిమా మంజులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో వెంకటేష్‌ నటించిన చంటి సినిమాలో హీరోయిన్‌ మీనాకు వదినగా నటించారు. 2002లో వెంకటేష్‌ చిత్రం వాసులో ఆమె తల్లిగా నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మంజులకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఇద్దరు సినిమాల్లో  కనిపిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...