న్యూఢిల్లీ, జులై 18: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష -నీట్- నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే అధికారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నీట్ కోసం ఎంసీఐ జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి ఎంసెట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. కగా, ముగ్గురు సభ్యుల బెంచ్లో ఒకరు ఈ తీర్పును వ్యతిరేకించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్, జస్టిస్ విక్రమ్జిత్ సేన్ నీట్ను కొట్టేయాలని చెప్పగా... బెంచ్లోని మరో సభ్యుడు జస్టిస్ అనిల్ దవే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణ చట్టబద్ధమని తీర్పు ఇచ్చారు. ‘నీట్’ నిర్వహణపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వీటిని పరిశీలించిన సుప్రీం కోర్టు నీట్తో పాటు వివిధ రాష్ట్రాలు విడిగా ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం వెల్లడించరాదని గతంలో మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వచ్చే సంవత్సరం నుంచి మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం ఎంసెట్ ఉంటుందా లేదా? అన్న అనుమానాలకు తెరపడింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment