Tuesday, July 2, 2013

నావిగేషన్ వ్యవస్థ ఇక మనకూ స్వంతం....

 'ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ' ప్రయోగం సక్సెస్... 

శ్రీహరికోట, జులై 2:  భారతదేశపు సొంత నావిగేషన్ వ్యవస్థలోని తొలి ఉపగ్రహం 'ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ' ను  సోమవారం రాత్రి  పీఎస్ఎల్వీ-సీ22 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. సోమవారం అర్ధరాత్రి 11:41 గంటలకు  ప్రయోగించిన  20.25 నిమిషాలకు ఇండియన్ రీజనల్  ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహ కక్ష్యను పెంచే ప్రక్రియను వారంలోగా హసన్ కేంద్రం చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఉపగ్రహంలో ద్రవ ఇంధనంతో నింపిన అపోజీ మోటార్లను (ఎల్ఎఎం) పనిచేయిస్తూ భూమధ్య రేఖకు 29 డిగ్రీల వాలులో 55 డిగ్రీల తూర్పు అక్షాంశంలోని భూస్థిర కక్ష్యలోకి చేర్చనున్నారు. ఇలా రెండేళ్లలో మరో మూడు ఉపగ్రహాలు ప్రయోగించి వాహన చోదకులకు మార్గ సమాచారాన్ని ఇస్రో అందజేయనుంది. అలాగే భవిష్యత్తులో 11 ఉపగ్రహాలను ప్రయోగించి దేశంతోపాటు చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల పరిధికి కూడా సమాచారాన్ని అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహం రెండు రకాల సేవలను అందిస్తుంది. వీటిలో స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ సాధారణ పౌరుల వినియోగానికి, రిస్ట్రిక్టెడ్ సర్వీస్ మిలటరీ వినియోగానికి ఉపయోగపడనున్నాయి. కాగా, ఈ ప్రయోగంతో భారత్.. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సరసన చేరింది.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...