Monday, July 1, 2013

ఇదిగిదిగో తెలంగాణా...

 హైదరాబాద్,   జులై 1:  'తెలంగాణ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే' అని ఇన్నాళ్లూ ప్రకటించిన కాంగ్రెస్... ఒక వేళ నిజంగా నే  ప్రత్యేక రాష్ట్రం వస్తే  ఆ  పన్నిన వ్యూహం ఫలించింది.    ఆదివారం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో తెలంగాణ సాధన పేరిట పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడే ఇటీవల టీఆర్ఎస్, బీజేపీ నిర్వహించిన వాటికన్నా... భారీ స్థాయిలో జన సమీకరణ జరిపిన ఈ సభలో, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఒకే వేదికపై నిలిచి, ఒకే మాట వినిపించారు. వర్గాలు, వైషమ్యాలతో ఇన్నాళ్లూ దూరదూరంగా ఉంటూ వచ్చిన నాయకులంతా ఒక్కటై తెలంగానం పాడారు. ఇప్పటిదాకా ఉద్యమం ఊసెత్తనివారు, అధిష్ఠానానికి అత్యంత విధేయులుగా పేరుబడ్డవారు, ఆచితూచి మాట్లాడేవారు, ఆవేశపరులు అంతా కలసికట్టుగా చేతిలో చెయ్యేసి తెలంగాణ వస్తోందని తేల్చి చెప్పేశారు. ప్యాకేజీ గ్యీకేజీ ఏమీ లేదని, సోనియా నేతృత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రాబోతోందని వెల్లడించారు. తెలంగాణకు మరో ప్రత్యామ్నాయం లేదంటూ సాధన సభలో తీర్మానం చేశారు. 'అధిష్ఠానం మనసులో ఏముందో తెలియకే ఇన్నాళ్లూ అవమానాలు భరించామని' పేర్కొనడం ద్వారా, అధిష్ఠానం మనోగతం తమకు తెలిసినట్టు, ఆమోదం తీసుకునే సభ నిర్వహించినట్టు టీ నేతలు  చెప్పుకొచ్చారు. "మా అస్తిత్వాన్ని గౌరవించండి.. మీ అస్తిత్వాన్ని గౌరవిస్తాం.. పరస్పరం గౌరవించుకుందాం.. ప్రాంతాలుగా విడిపోదాం'' అని సీమాంద్రులకు పిలుపునిచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...