Thursday, July 18, 2013

విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పదు...ఉండవల్లి

విశాఖపట్నం, జూలై 18 : దేశానికి మంచి అయ్యే ఏ అభిప్రాయమైనా తెలంగాణ, సీమాంధ్ర నేతలు అంగీకరించాల్సిందేనని  రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం విడిపోయినా వచ్చే ప్రమాదమేమీ లేదని,  అయితే దేశ ప్రజలు ఒప్పుకోవాలని, అసెంబ్లీలో తీర్మానం కావాలని అన్నారు.   హైదరాబాదును దేశ రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని,  విభజన అనివార్యమైతే హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.  హైదరాబాదు పై ఉన్న ప్రేమతో సీమాంధ్రులు విశాఖను విస్మరించారన్నారు.   తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సీమాంధ్ర వారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని , తెలంగాణ ప్రజలకు అవాస్తవాలు చెప్పి, సీమాంధ్రులపై ద్వేషం పెంచుతున్నారన్నారు. సీమాంధ్రులను దోపిడీ దొంగలుగా తెరాస ముద్ర వేసిందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తోందని ఉండవల్లి మండిపడ్డారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...