హైదరాబాద్, జూలై 18 : పంచాయతీ ఎన్నికల పర్వంలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తంతు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 21,441 పంచాయతీలు ఉండగా... వాటిలో 2562 గ్రామాల సర్పంచ్ల ఎన్నిక అధికారికంగా ఏకగ్రీవమైంది. వేలంపాటల ద్వారా ఏకగ్రీవమైన గ్రామాల ఫలితాలను మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో మాత్రం అత్యధిక అభ్యర్థులు 'ఫలానా పార్టీ మద్దతు'తోనే బరిలో నిలిచినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ రంగు కండువాలతోనే తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏక్రగీవాల్లో ఏ పార్టీ ఖాతాలో ఎన్ని పడ్డాయనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి... అధికారపార్టీయే ఏకగ్రీవాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. 2562 ఏకగ్రీవ సర్పంచ్లకుగాను... 764 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 548 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇక... జగన్ పార్టీకి 428 పంచాయితీలు పోటీలేకుండా దక్కాయి. టీఆర్ఎస్ మద్దతుదారులు 87 మంది ఏకగ్రీవంగా గెలుపొందగా.. ఇతరులు 754 మంది ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment