న్యూఢిల్లీ, జులై 14: ‘టెలిగ్రామ్’ అనే చిరపరిచితమైన పిలుపు ఇక దేశంలో ఎక్కడాచిరపరిచితమైన పిలుపు వినిపించదు.1850లో కోల్కతా నుంచి డైమండ్ హార్బర్ వరకు ప్రయోగాత్మకంగా తొలి టెలిగ్రాఫ్ లైన్ను అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. టెలికం రంగం పుంజుకోని రోజుల్లో శరవేగంగా సమాచారాన్ని చేరవేసే ఏకైక సాధనంగా టెలిగ్రామ్ వెలుగొందింది. వార్తాసంస్థల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషించింది. అయితే అధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులోకి రావడంతో కొన్నేళ్లుగా టెలిగ్రామ్ వైభవం కొడిగట్టింది. టెలిగ్రాఫ్ వ్యవస్థకు ఏటా రూ.100 కోట్ల మేరకు ఖర్చవుతుండగా, దీనిపై ప్రస్తుతం దాదాపు రూ.75 లక్షల వార్షికాదాయం మాత్రమే లభిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం విస్తరించడంతో టెలిగ్రామ్ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం టెలిగ్రామ్ చార్జీలను 2011లో సవరించింది. 50 పదాలకు రూ.27గా చార్జీ నిర్ణయించింది. అయినా ఆదాయం కంటే నిర్వహణ ఖర్చు పెరగడంతో టెలిగ్రామ్ సేవలను శాశ్వతంగా నిలిపివేయాలి బీఎస్ఎన్ఎల్ నిర్ణయించుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment