Monday, July 1, 2013

చాంపియన్ కు షాక్...

జమైకా, జులై 1: ముక్కోణపు సిరీస్ లో  వెస్టిండీస్ వరసగా రెండవ విజయం నమోదు చెసింది.  భారత్ తో  జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్  ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో 230 పరుగులు చేసింది.  ఓపెనర్ చార్లెస్ (97) ఒంటరి పోరాటంతో విండీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  భారత బౌలర్లలో యాదవ్ 3, శర్మ, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారత జట్టులో అత్యధికంగా రోహిత్ శర్మ 60, రైనా 44, ధోని 27, జడేజా 15 పరుగులు చేశారు. రోచ్, బెస్ట్, సమ్మి రెండేసీ వికెట్లు, శ్యామ్యూల్ ఒక వికెట్ పడగొట్టారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...