Wednesday, July 17, 2013

బడి భోజనానికి 20మంది బలి...

పాట్నా,జులై 17:  ‘మధ్యాహ్న భోజనం’ ఏకంగా 20 మంది  చిన్నారుల ప్రాణాలను బలిగొంది.  బీహార్‌లోని శరణ్ జిల్లా మష్రాఖ్ బ్లాక్ గందావన్ గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే వడ్డించే మధ్యాహ్న భోజ నాన్ని ఆరగించిన చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారందరినీ హుటాహుటిన చాప్రా సదర్ ఆస్పత్రికి తరలించేటప్పటికే పదకొండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తరవాత మరో 9  మంది తీవ్ర ఆస్పత్రి లో మరణించారు. ఇంకా 41 మందికి వైద్యులు  చికిత్స అందిస్తున్నారు.  తీవ్రంగా కలుషితమైన వంటనూనె, క ల్తీ దినుసులతో వండటం వల్లే ఆహారం విషపూరితమై ఉంటుందని  అధికారులు భావిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...