Thursday, June 13, 2013

వచ్చే ఎన్నికల బరిలో ఫెడరల్ ఫ్రంట్...!

న్యూఢిల్లీ,  జూన్ 13:  వచ్చే ఎన్నికల నాటికి 'ఫెడరల్ ఫ్రంట్' ఏర్పాటు దిశగా  జేడీయూ పావులు కదుపుతోంది.  బి.జె.పి.కి మోడీ సారధ్యం వల్ల ముస్లిం ఓట్లు పోతాయని భయపడుతున్న   జేడీయూ ఎన్డీయే తో తెగదెంపులు చేసుకుని కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ మధ్య చర్చలు జరిగాయి. మరిన్ని పార్టీలను కూటమిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే జేడీయూ నేత , బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తమ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగిని  మమతతో చర్చలకు  కోల్‌కతా పంపారు.  నితీశ్ సూచన మేరకు కోల్‌కతా వెళ్లిన త్యాగి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై మమతతో చర్చలు జరిపారు. అక్కడి నుంచే మమతా బెనర్జీ అటు నితీశ్‌తోనూ ఇటు ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా చర్చలు జరిపారు. వాస్తవానికి, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ నితీశ్ కొంతకాలంగా డిమాం డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని మమత, ఒడిసాకు ప్రత్యేక హోదా కల్పించాలని నవీన్ పట్నాయక్ కూడా డిమాం డ్ చేస్తున్నారు. నవీన్ ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి నితీశ్ మద్దతు కూడా ఇచ్చారు. 'ప్రత్యేక హోదా' కోరుతున్న ముగ్గురు ముఖ్యమంత్రులు 'ఫెడరల్ ఫ్రంట్' పై ఏకమయ్యారు. కాగా ఫెడరల్ ఫ్రంట్‌కు రూపకల్పన జరిగితే తమ పార్టీ తప్పకుండా పరిశీలిస్తుందని బీజేడీ అధ్యక్షుడు, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. తాము లౌకిక వాదులమని, ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వస్తే పరిశీలిస్తామని చెప్పారు.  మరోవైపు 2014 ఎన్నికల తర్వాత 'ఫ్రెండ్లీ ప్రభుత్వం' వస్తుందని తమిళనాడు సీఎం జయలలిత వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...