Wednesday, June 12, 2013

చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో టీమిండియా

లండన్, జూన్ 12: చాంపియన్స్ ట్రోఫీలో  టీమిండియా వరుసగా రెండు విజయాలతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ధోనిసేన ఫీల్డింగ్ ఎంచుకోగా... వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. జడేజాకు ఐదు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.1 ఓవర్లలో 2 వికెట్లకు 236 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (107 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్సర్)  సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మ (56 బంతుల్లో 52; 7 ఫోర్లు), కార్తీక్ (54 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అండగా నిలిచారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...