Saturday, May 11, 2013

కర్ణాటక 28వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

 బెంగళూరు,మే 11: కర్ణాటక 28వ ముఖ్యమంత్రిగా  సిద్ధరామయ్య సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ఏఐసీసీ పరిశీలకుల బృందం కొత్త నాయకుడి ఎన్నికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించింది. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌ను సైతం నిర్వహించింది.  ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 121 సీట్లు గెల్చుకొని కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అవినీతి రహిత, పారదర్శక పాలనను అందిస్తానని  సిద్ధరామయ్య ప్రజలకు హామీ ఇచ్చారు.  ముందుగా తానొక్కడినే ప్రమాణం చేస్తానని, సోనియా, రాహుల్‌ను కలిసిన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...