Saturday, May 11, 2013

వైదొలగిన బన్సల్, అశ్వనీకుమార్

న్యూఢిల్లీ,మే 11: దేశవ్యాప్త ఒత్తిడికి కాంగ్రెస్  తలొగ్గింది.  తప్పనిసరి పరిస్థితుల్లో తన కళంకిత మంత్రులిద్దరినీ తప్పించింది. బొగ్గు కుంభకోణంపై సీబీఐ నివేదికను  మార్చేసిన కేంద్ర న్యాయ మంత్రి అశ్వనీకుమార్, రైల్వే బోర్డులో లాభదాయక పోస్టును అమ్మకానికి పెట్టి సీబీఐకి అడ్డంగా దొరికిన మేనల్లుడి నిర్వాకంతో రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ లను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. తమను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన అనంతరం శుక్రవారం రాత్రి సమయంలో వారిద్దరూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆయన అధికారిక నివాసం లో విడివిడిగా కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు.  బన్సల్, అశ్వనీకుమార్ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతున్నట్టు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...