Thursday, April 25, 2013

బ్రాహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు...

హైదరాబాద్, ఏప్రిల్ 25: కడప జిల్లాలోని బ్రాహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది. . బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10,766 ఎకరాల భూమి కేటాయింపులకు సంబంధించిన అవగాహన పత్రంపై 2007 మే 21న సంతకాలు జరిగాయి. ఆ పనులు సకాలంలో పూర్తి కానందున ఇప్పుడు దీన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం వేగుంటపల్లి, కొత్తగుంటపల్లి, పి. బొమ్మపల్లి, తూగుటపల్లి, ప్రాంతాలలో ఉన్న భూములను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించారు. ఆనాటి ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పనులు పూర్తి కావాలి. లేదంటే ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్టేనని కూడా ఆనాటి అవగాహన పత్రంలో పేర్కొన్నారు. ఈ అంశం ఆధారంగానే ఇప్పుడు కిరణ్ సర్కారు ఇప్పుడు ఈ భూముల కేటాయింపును రద్దు చేసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...