హైదరాబాద్, ఏప్రిల్ 27 : ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సీనియర్ ఇంటర్ పరీక్షలలో జనరల్ (రెగ్యులర్) లో 7,71587 మంది విద్యార్థులు హాజరుకాగా.. 5,04,300 (65.36%) మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం 6.93శాతం పెరిగింది. మార్కుల ఆధారంగా 2,43,612 మంది 'ఎ' గ్రేడ్ సాధించారు. ఉత్తీర్ణతలో ఈ సారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికల్లో 3,68,268 మంది పరీక్షలు రాయగా 2,54,258 (69.04%) మంది పాసయ్యారు. బాలురలో 4,03,319 మంది పరీక్షలు రాయగా 2,50,042 (62%) మంది పాసయ్యారు. జిల్లాలవారీగా ఫలితాలు చూస్తే జనరల్లో 82 శాతంతో కృష్ణా జిల్లా ముందుండగా.. 49 శాతంతో మహబూబ్నగర్ చివర్లో నిలిచింది. వొకేషనల్ ఫలితాల్లో శ్రీకాకుళం 68 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. మహబూబ్నగర్ 28 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి మే 6 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment