Thursday, April 11, 2013

అన్నపూర్ణ స్టూడియో లో అవినీతి లేదు-నాగార్జున

హైదరాబాద్, ఏప్రిల్ 11:  కొండలను కరిగించి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించామని, అప్పట్లో స్టూడియో నిర్మాణం కోసం భూమిని కూడా ఉచితంగా తీసుకోలేదని, మొత్తం డబ్బు చెల్లించే స్టూడియోకి భూమిని తీసుకుని స్టూడియో నిర్మించామని సినీ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో స్టూడియో తప్ప ఏమీ ఉండేదికాదని, ఎంతో కష్టపడి స్టూడియో నిర్మించామని ఆయన తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోపై విమర్శలు రావడంపై స్పందించిన  అక్కినేని నాగార్జున ఒక చానల్ తో  మాట్లాడుతూ స్టూడియోకు సంబంధించిన డాక్కుమెంట్లు ఉన్నాయని, ఎవరు చూడ్డానికి వచ్చినా డాక్యుమెంట్లు చూపించేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకోసం నాన్న (డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ కు చెన్నై నుంచి వచ్చారని నాగ్ అన్నారు. యాక్టింగ్ స్కూల్ కమర్షియల్ కాదని, కొంతమంది తెలివైన విద్యార్థులకు రాయితీ ఇచ్చి చదివిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్‌కెన్వెన్షన్ ల్యాండ్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడడం సరికాదని నాగార్జున అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజంలేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, గత 70 సంవత్సరాలుగా కుటుంబానికి తెలిసింది సినిమాలేనని, నాన్న కూడా రాజకీయాల్లోకి వెళ్లమనలేదని నాగార్జున వ్యాఖ్యానించారు రాజకీయాల గురించి కలలోకూడా అనుకోనని, తమ కుటుంబం అంతా సినిమాల్లోనే ఉన్నాం, ఉండబోతున్నామని నాగార్జున స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నామని, అలాగే దివంగత వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కార్యక్రమంలో కూడా పాల్గొన్నామని నాగార్జున అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, తాము ముందుకు వస్తామని, తమ వంతుగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొని చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తనకు స్నేహితుడని, ఆయనకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకే తాను చంచల్ గూడ జైలుకు వెళ్లి కలుస్తున్నానని నాగార్జున వివరణ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...