Friday, April 12, 2013

ప్రాణ్ కు పాల్కే అవార్డు

ముంబై, ఏప్రిల్ 12 : బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు ప్రతిష్టాత్మక  దాదాసాహేబ్ పాల్కే అవార్డు ప్రకటించారు.  350కి పైగా చిత్రాల్లో నటించిన ప్రాణ్  ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి.  పలు చిత్రాలలో క్యారెక్టర్ యాక్టర్ గా కూడా నటించారు.  2001లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు బహూకరించింది.  92 ఏళ్ళ ప్రాణ్   1998 సంవత్సరం నుంచి  నటనకు విశ్రాంతినిచ్చారు. 1940లో 'యమలా జట్' చిత్రంలో బాలీవుడ్ చిత్ర కెరీర్‌ను ప్రారంభించిన ప్రాణ్... అనేక చిత్రాల్లో విలన్‌గా నటిస్తూనే.. క్లాసికల్ టచ్ ఉన్న "మిలాన్", "మధుమతి", "కాశ్మీర్ కి కాళి" చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత ఈయన క్యారెక్టర్ నటుడిగా, స్నేహితుడు, తండ్రి, తాత వంటి పాత్రల్లో నటిస్తూ వచ్చారు. అమితాబ్ నటించిన "జంజీర్", "ఉప్‌కార్", "పరిచయ్" చిత్రాల్లో వెరైటీ  పాత్రలను చేశారు. తెలుగులో కొదమ సింహం చిత్రంలో ప్రాణ్ విలన్ పాత్రలో నటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...