హైదరాబాద్, ఏప్రిల్ 27 : సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను ప్రభుత్వం భారీగా పెంచింది. అన్ని థియేటర్లలో కింది తరగతి టికెట్ రేటును రూ.10 మేర పెంచారు. బాల్కనీ టికెట్లు నాన్ ఏసీ థియేటర్లలో రూ.15, ఏసీ థియేటర్లలో రూ.20 చొప్పున పెరిగాయి. కింది తరగతి, పై తరగతి మినహా మిగతా తరగతుల టికెట్ రేట్లను తాము అందించే సౌకర్యాలకు అనుగుణంగా పెంచుకునే అధికారం థియేటర్ యాజమాన్యాలకే కల్పించారు. ఒకవేళ యాజమాన్యాలు టికెట్లు ధరను తగ్గించాలనుకుంటే (సినిమాకు డిమాండ్ లేనిపక్షంలో) తగ్గించుకోవచ్చు. కానీ వినోదపు పన్నును మాత్రం నిర్ణీత టికెట్ రేటు మేరకే చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లను ఐదు కేటగిరీలుగా విభజించి రేట్లు నిర్ణయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment