హైదరాబాద్ , మార్చి 11: నామినేషన్లు దాఖలు గడువు ముగియడనికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. కాంగ్రెస్పార్టీ తమ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అధిష్ఠానం ఆమోదించిన ఐదు పేర్లను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ సంఖ్యాబలానికి తగ్గట్లుగా ఐదుగురిని ఎంపిక చేశామని, ఆరో అభ్యర్థి గురించి ఇంకా ఆలోచిస్తామని బొత్స తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం మొత్తం 160 మంది దరఖాస్తు చేసుకోగా... అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ఐదుగురిని ఎంపిక చేశామన్నారు. గవర్నర్ కోటా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎ. లక్ష్మీ శివకుమారిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. రెండో అభ్యర్థిగా విజయనగరం డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామిని, మూడో అభ్యర్థిగా మాజీ మంత్రి, పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు మహ్మద్ షబ్బీర్ అలీని ఎంపిక చేసినట్లు చెప్పారు. నాలుగో అభ్యర్థిగా కరీంనగర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సంతోష్కుమార్ను, ఐదో అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిలను ఎంపిక చేశామన్నారు. సంవత్సరం ముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఖాళీ కాగా.. ఆ స్థానంలో శివకుమారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సంగతి గుర్తు చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆమెను.. కోస్తా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే......
ఎ. శివ లక్ష్మీకుమారి
(తూర్పుగోదావరి - ఎస్సీ)
కె. వీరభద్రస్వామి
(విజయనగరం - వైశ్య)
మహ్మద్ షబ్బీర్ అలీ
(నిజామాబాద్ - మైనారిటీ)
టి. సంతోష్కుమార్
(కరీంనగర్- మున్నూరు కాపు)
పి.సుధాకర్రెడ్డి
(ఖమ్మం - రెడ్డి)
ఎ. శివ లక్ష్మీకుమారి
(తూర్పుగోదావరి - ఎస్సీ)
కె. వీరభద్రస్వామి
(విజయనగరం - వైశ్య)
మహ్మద్ షబ్బీర్ అలీ
(నిజామాబాద్ - మైనారిటీ)
టి. సంతోష్కుమార్
(కరీంనగర్- మున్నూరు కాపు)
పి.సుధాకర్రెడ్డి
(ఖమ్మం - రెడ్డి)
No comments:
Post a Comment