న్యూఢిల్లీ, మార్చి 21: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి మే 5న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం అదేనెల 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అదేరోజు నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ గడువుగా నిర్ణయించారు. మే 5న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 50,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 224 స్థానాలు గల అసెంబ్లీలో 36 స్థానాలు ఎస్సీలకు, 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment