లండన్ , మార్చి 21: రక్తంలోని పదార్థాలను, జీవక్రియలను పసిగట్టడం ద్వారా గుండెపోటును కొన్ని గంటల ముందుగానే గుర్తించే ఓ పరికరాన్ని స్విస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చర్మం కింద అమర్చే ఈ ఇంప్లాంట్ 24 గంటలపాటూ రక్తంలోని ఐదు రకాల పదార్థాలను పరిశీలిస్తుంది. 1.4 సెం.మీ. మాత్రమే ఉండే ఈ పరికరం చర్మంపై అమర్చే చిన్న ప్యాచ్ నుంచి విద్యుత్ను గ్రహించి పనిచేస్తుంది. గుండెకు ఇబ్బందిగా పరిణమించే పదార్థాలను, జీవక్రియల్లో తేడాలను గుర్తించిన వెంటనే ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోన్కు లేదా టాబ్లెట్కు సమాచారం పంపుతుంది. వాటి నుంచి ఇంటర్నెట్ ద్వారా నేరుగా వైద్యుడి కంప్యూటర్కు సమాచారం అందుతుంది. దీంతో వైద్యుడి సూచనల మేరకు రోగి ముందుగానే జాగ్రత్తపడే అవకాశం కలగనుంది. ఇది మరో నాలుగేళ్లలోగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment