Thursday, March 21, 2013

'సడక్ బంద్' సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత: అరెస్టులు

హైదరాబాద్, మార్చి 21 : తెలంగాణ పొలిటికల్ జేఏసీ కర్నూలు జిల్లా హైవే పై గురువారంనాడు నిర్వహించిన న 'సడక్ బంద్' సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  మహాబూబ్ నగర్ జిల్లా, ఆలంపూర్ టోల్ ప్లాజా వద్దభారీగా  టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన తెలంగాణవాదులు వాహనాలపై రాళ్లతో దాడిచేసి, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావును , తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ జెఏసి నేత శ్రీనివాస్ గౌడ్‌లను  అరెస్టు చేశారు. కొత్తకోటలో సడక్ బంద్ చేపట్టిన ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, రాజయ్య, సమ్మయ్యలను, షాద్‌నగర్‌లో సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును పోలీసులు అరెస్టు చేశారు.  కాగా ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులతో పాటు, 40 వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...