Saturday, March 23, 2013

అమితాబ్ కు ఎన్టీఆర్ జాతీయ అవార్డు


 హైదరాబాద్, మార్చి 23 : 2011 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును శ్యాం బెనగల్ కు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డును ఆదిశేషగిరిరావుకు, రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డును కైకాల సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది.  ఉగాది రోజున ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆలిండియా సూపర్ స్టార్ గా రాణించిన అమితాబ్  జంజీర్, దీవార్, డాన్ వంటి చిత్రాలు.. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నిప్పులాంటి మనిషి, మగాడు, యుగందర్ గా రూపొంది ప్రేక్షకులను అలరించాయి. ఎన్నో విషయాల్లో ఎన్టీఆర్ అమితాబ్ లకు సామీప్యం ఉంది. ఎన్టీఆర్, అమితాబ్ ఇద్దరూ కృషిని నమ్ముకుని సూపర్ స్టార్ లుగా ఎదిగినవారే. ఇటీవలే అక్కినేని జాతీయ అవార్డును అందుకున్న ప్రఖ్యాత దర్శకుడు శ్యాంబెనెగల్ కు ప్రతిష్టాత్మక బి.ఎన్ రెడ్డి అవార్డు లభించింది. ప్శ్యాంబెనగల్ హైదరాబాద్ వాసి కావడం విశేషం. బెనెగల్ రూపొందించిన చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై తమదైన సత్తా చాటాయి.  నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు అందుకున్న పద్మాలయా నిర్మాణ సారధుల్లో ఒకరైన జి.ఆదిశేషగిరిరావు  నిర్మాతగా తన అన్న హీరో కృష్ణతో పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు వంటి రజతోత్సవ చిత్రాలను నిర్మించారు. ఇక సిపాయి కూతురుతో కథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసి... ఆపైన ప్రతినాయకుడిగా తనదైన బాణి పలికించిన  కైకాల సత్యనారాయణ 2011 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అందుకోనున్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత అనితరసాధ్యమైన రీతిలో యముడు, దుర్యోదనుడు వంటి పౌరాణిక పాత్రలకు సైతం ప్రాణం పోశారు. 700 పైచిలుకు చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...