Sunday, March 24, 2013

క్లీన్ స్వీప్

న్యూఢిల్లీ, మార్చి 24:  టెస్టు క్రికెట్ లో టీమిండియా సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. షిరోజ్ షా కోట్లా మైదానంలో చిరస్మరణీయ విజయంతో అసీస్ ను  ఓడించి  గతేడాది ఆసీస్ గడ్డపై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.  మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో  నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 4-0 తేడాతో గెల్చుకుంది. చివరి టెస్టులో ఆసీస్ ను ఆరు వికెట్లతో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని  31.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. పూజారా(82) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...