Thursday, March 21, 2013

ముంబయి పేలుళ్ల కేసులో 20 ఎళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, మార్చి 21 :   1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో  20 ఎళ్ళ తర్వాత సుప్రీంకోర్టు  తీర్పు వెల్లడించింది. యాకూబ్, అబ్దుల్ రజాక్ మెమన్ లకు  ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈకేసులో మరో పదిమంది నిందితులకు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ తప్పించుకు తిరుగుతున్నాడని కోర్టు పేర్కొంది. పాక్ సైన్యం ఐఎస్ ఐ సహకారంతో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని తెలిపింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను పాక్ ఉల్లంఘించిందని, ముంబయి నుంచి దుబాయ్ మీదగా ఉగ్రవాదులు ఇస్లామాబాద్ కు వెళ్లినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో కస్టమ్స్ అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించింది.  కాగా కేసు విచారణలో ఉండగా మాజీ కస్టమ్స్ అధికారి ఎస్.ఎన్. థాపా మృతి చెందగా, మరణశిక్ష పడిన మహమ్మద్ ఇక్బాల్ కూడా మృతి చెందాడు.
సంజయ్ దత్ కు అయిదేళ్ల జైలు
 బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఆయుధాలు కలిగిన కేసులో సుప్రీంకోర్టు  అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే 16 నెలల జైలుశిక్ష అనుభవించిన సంజయ్ దత్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన మరో మూడున్నరేళ్లు శిక్ష అనుభించాల్సి ఉంది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...