Thursday, March 21, 2013

కోదండరాంకు 4వరకు రిమాండ్

హైదరాబాద్, మార్చి 21 : సడక్ బంద్ లో పాల్గొన్న కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌రెడ్డిలపై మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 147, 148, 149, 348(3డి), పీపీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఏ-4గా కోదండరాం, ఏ-5గా శ్రీనివాస్‌గౌడ్, ఏ-6గా జూపల్లి, ఏ-7 ఈటెల, ఏ-8గా జితేందర్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. వీరికి అలంపూర్ కోర్టు ఏప్రిల్ 4వరకు రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్‌పై రేపు అలంపూర్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీంతో జేఏసీ నేతలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మహబూబ్‌నగర్ పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు తరలించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...