తీహార్,ఫిబ్రవరి 9: పార్లమెంట్పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్ గురుకు ఎట్టకేలకు కేంద్రం ఉరిశిక్ష అమలు చేసింది. అత్యంత గోప్యంగా శనివారం ఉదయం ఎనిమిది గంటలకు తీహార్ జైలులో అఫ్జల్ ను ఉరి తీశారు. ఉరిశిక్షను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. అఫ్జల్ కు క్షమాభిక్షను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించటంతో కేంద్రం శిక్షను అమలు చేసింది. 2001 డిసెంబర్ 13 న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్జల్గురు ప్రధాన సూత్రధారి. 2001 డిసెంబర్ 15న అఫ్జల్గురును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అఫ్జల్గురుకు 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో అఫ్జల్గురు క్షమాభిక్ష పిటిషన్ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. తరవాత కేసు ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్గురును తీహార్ జైలుకు తీసుకువచ్చారు. అఫ్జల్గురుకు ఉరిశిక్ష అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మూ కాశ్మీర్ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ విధించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment