న్యూఢిల్లీ, జనవరి 31: లోక్పాల్ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన 16 సవరణలలో 14 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేసులు నమోదైన వారిని విచారించే అధికారం లోక్పాల్కు ఇవ్వడానికి ఆమోదించిన మంత్రివర్గం.. ఆయా కేసులను విచారించే సీబీఐ అధికారులను మధ్యలో బదిలీ చేయాలంటే లోక్పాల్ అనుమతి తీసుకోవాలన్న అంశానికి మాత్రం ఆమోదం తెలపలేదు. అలాగే లోక్పాల్ విచారణ ఎదుర్కొంటున్న అధికారి ప్రాథమిక విచారణ సమయంలో తన వాదన వినిపించడానికి వీలుండకూడదన్న కీలక సూచనను కూడా మాత్రం ప్రభుత్వం ఆమోదించలేదు. లోకాయుక్తల నియామకాన్ని లోక్పాల్ బిల్లు పరిధి నుంచి తప్పించాలన్న ని సెలెక్ట్ కమిటీ సూచనకు ఆమోదం లభించింది. . లోక్పాల్ చట్టం వచ్చిన ఏడాదిలోగా రాష్ట్ర ప్రభుత్వాలు లోకాయుక్తలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు పొందకుండా సాయాన్ని మాత్రం పొందే సొసైటీలు, ట్రస్టులను లోక్పాల్ పరిధి నుంచి తప్పించాలన్న సెలెక్ట్ కమిటీ సూచనను కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు పొందే సంస్థలను దీని పరిధిలో చేర్చారు. ఈ సవరణలతో కూడిన లోక్పాల్ బిల్లును రాజ్యసభలో ఓటింగ్కు పెడతారు. రాజ్యసభ ఆమోదం పొందితే అప్పుడు మళ్లీ బిల్లు లోక్సభకు వెళ్తుంది.
మళ్లీ ఆందోళన: అన్నాహజారే
కాగ, లోక్పాల్బిల్లు కొత్త ముసాయిదాను అన్నా హజారే తిరస్కరించారు. బలహీనమైన చట్టాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాను త్వరలో ఆందోళన ప్రారంభిస్తానని పాట్నాలో వెల్లడించారు. అవినీతి అంతానికి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా కఠినమైన బిల్లు తెస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు.
మళ్లీ ఆందోళన: అన్నాహజారే
కాగ, లోక్పాల్బిల్లు కొత్త ముసాయిదాను అన్నా హజారే తిరస్కరించారు. బలహీనమైన చట్టాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాను త్వరలో ఆందోళన ప్రారంభిస్తానని పాట్నాలో వెల్లడించారు. అవినీతి అంతానికి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా కఠినమైన బిల్లు తెస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు.
No comments:
Post a Comment