Friday, February 1, 2013

పవార్ కీ కావాలి తెలంగాణ...

న్యూఢిల్లీ, జనవరి 31:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ తన మద్దతును పునరుద్ఘాటించారు.‘తెలంగాణపై నిర్ణయ ప్రకటనలో జాప్యం యూపీఏ ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని,  కేంద్రం మరింత తాత్సారం చేయకుండా తక్షణం తెలంగాణకు అనుకూలంగా  నిర్ణయం తీసుకోవాలని తమ పాటీ కోరుతున్నట్టు  శరద్‌పవార్ చెప్పారు.తెలంగాణ విషయంలో  సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ కు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.  ‘‘ తెలంగాణ అంశాన్ని  కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి,  రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చి,  తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న  ప్రకటన చేసి కూడా ఇంకా  నాంపుడు  ధోరణి పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని,  త్వరగా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని  ప్రధానికి వివరించినట్లు  పవార్ తెలిపారు. తెలంగాణకు కేంద్రం అంగీకరిస్తే మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ డిమాండ్ తెరపైకి రాదా అని ప్రశ్నించగా, విదర్భ రాష్ట్రం ఏర్పడినా తమకెలాంటి అభ్యంతరాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...