హైదరాబాద్, జనవరి 31:సహకార సంఘాల మొదటిదశ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంఖ్యలో సొసైటీలను సొంతం చేసుకుంది. గురువారం తొలిదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగినవి కలిపి 1365 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 595 స్థానాలు దక్కగా.. టీడీపీకి 349, వైసీపీకి 218 స్థానాలు లభించాయి. టీఆర్ఎస్ ఒక్క జిల్లాలో ఆధిక్యత నిలుపుకొని.. మొత్తమ్మీద 61 స్థానాలు దక్కించుకోగలిగింది. జిల్లాల వారీగా చూస్తే.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలో ఖమ్మం తప్ప ఏడు జిల్లాలలో కాంగ్రెస్ ఆధిక్యత చాటింది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మెదక్ జిల్లా మాత్రం టీఆర్ఎస్కు దక్కింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ.. కేవలం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఆధిక్యం కనబరిచింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment