Sunday, February 24, 2013

ధోనీ డబుల్ ధమాకా...

 చెన్నై, ఫిబ్రవరి 24:  ఆస్ట్రేలియాతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్టులో  మహేంద్ర సింగ్ ధోనీ డబుల్‌తో, విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి  భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 515 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.  ధోనీ(206), భువనేశ్వర కుమార్(16) క్రీజ్ లో ఉన్నారు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన సచిన్ టెండూల్కర్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లోయిన్ బౌలింగులో అవుటయ్యాడు.  పుజారా44, విజయ్ 10, జడేజా 16, సెహ్వాగ్ 2, అశ్విన్ 3, హర్భజన్ 11 పరుగులకు అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో పాటిస్సన్ 4, లియాన్ 3 వికెట్లు పడగొట్టారు. హెన్రీక్విస్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ధోని  ఈ టెస్టు లో వ్యక్తిగత స్కోరు 117 పరుగుల వద్ద 4 వేల పరుగులు పూర్తి చేశాడు. 74వ టెస్టులో అతడు 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...