శ్రీహరికోట,ఫిబ్రవరి 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సోమవారం జరిపిన పీఎస్ఎల్వీ-సీ 20 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ-సీ 20 రాకెట్ ద్వారా భారత్- ఫ్రాన్స్ సమ్యుక్త ఉపగ్రహం సరళ్తోపాటు 6 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. రాకెట్ ప్రయోగాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్కుమార్రెడ్డి షార్ నుంచి వీక్షించారు. సోమవారం సాయంత్రం 5.56 నిముషాలకు జరగల్సిన ప్రయోగం ఐదు నిముషాలు ఆలస్యంగా అంటే 6.01 గంటలకు జరిగింది. 44.4 మీటర్ల ఎత్తు కలిగిన పీఎస్ఎల్వీ-సీ20 రాకెట్ ప్రయోగ సమయంలో 229.7 టన్నుల బరువుకలిగి ఉంది. పీఎస్ఎల్వీ రాకెట్లను గతంలో స్ప్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించేవారు. అయితే పీఎస్ఎల్వీ-సీ20 ని స్ప్రాపాన్ బూస్టర్లు లేకుండానే ప్రయోగించడం విశేషం. పీఎస్ఎల్వీ-సీ20రాకెట్ ప్రయోగానికి 240 కోట్లు ఖర్చు చేశారు. రాకెట్ తయారీకి రూ. 80 కోట్లు, సరళ్ ఉపగ్రహం తయారీకి రూ. 100 కోట్లు వినియోగించారు. ప్రయోగంలో ఇతర ఖర్చులకు రూ. 60 కోట్లు అయినట్టు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment