హైదరాబాద్, ఫిబ్రవరి 24: హైదరాబాదు దిల్సుఖ్ నగర్ పేలుళ్లు తమ పనేనంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి లష్కరే తోయిబా పేరుతో లేఖ వచ్చింది. లష్కరే తోయిబా పేరుతో బిజెపి కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చిందని, బాంబు పేలుడు తమ పనేనని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఆయన చెప్పారు. బాంబు పేలుడు తమ పనేనని, తర్వాత తమ టార్గెట్ బేగంబజార్ అని, అక్కడ కూడా త్వరలో దాడి చేస్తామని లేఖలో హెచ్చరించారని కిషన్ రెడ్డి చెప్పారు. తమకు వచ్చిన లేఖ పైన అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా,దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన నిందితులు కర్నాటకలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో రెండు ఎన్ఐఏ బృందాలు బెంగళూరులో దర్యాఫ్తు కొనసాగిస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment