చెన్నై,ఫిబ్రవరి 26: భారీ విజయంతో భారత్ సిరీస్లో బోణీ చేసింది. చిదంబరం స్టేడియంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ధోనిసేన 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 50 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... 11.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నెగ్గింది. ఓపెనర్లు విజయ్ (6), సెహ్వాగ్ (23 బంతుల్లో 19; 3 ఫోర్లు) మరోసారి విఫలమయ్యారు. పుజారా (8 నాటౌట్), సచిన్ (10 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో ప్యాటిన్సన్, లియోన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు సాధించగా... జడేజా మూడు, హర్భజన్ రెండు వికెట్లు తీశారు. సంచలన ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శనివారం (మార్చి 2) నుంచి హైదరాబాద్లో జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment