Friday, February 1, 2013

మిథాలీసేన శుభారంభం...

ముంబై, జనవరి 31: వన్డే ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘనంగా ప్రారంభించింది. గ్రూప్ ఎ లో భాగంగా గురువారం బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీసేన 105 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.   టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ తిరుష్ కామిని  కెరీర్‌లో తొలి సెంచరీ సాధించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్  అర్ధసెంచరీ చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తరువాత వెస్టిండీస్ జట్టు 44.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటయింది.  సెంచరీతో రాణించిన కామినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...