న్యూఢిల్లీ,జనవరి 28: ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ఆరో నిందితుడు మైనర్ అని జువనైల్ జస్టిస్ బోర్డు సోమవారం ప్రకటించింది. అందువల్ల అతనిపై విచారణ మైనర్ను విచారించే రీతిలోనే జరుగుతుంది. దాంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతనిపై విచారణ జరిగే అవకాశం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురు నిందితులపై విచారణ జరుపుతోంది. స్కూల్ సర్టిఫికెట్ను చూపుతూ ఆరో నిందితుడు 1995 జూన్ 4వ తేదీన జన్మించినట్లు జువనైల్ జస్టిస్ బోర్డు తెలిపింది. పోలీసులు అతనికి బోన్ ఆసిఫికేషన్ టెస్టు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పాఠశాల సర్టిఫికెట్ పట్ల బోర్డు విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తాము ఈ విషయంపై హైకోర్టుకు వెళ్తామని నిందితుడికి వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాది అంటున్నారు. మైనర్ అయినందున ఆరో నిందితుడిని జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద మాత్రమే విచారిస్తారు. దాని కింద అతనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment