రాంచీ,జనవరి 19: ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని ధోని సేన 28.1 ఓవర్లలోనే చేరుకుంది. కోహ్లి(77) అజేయ అర్థ సెంచరీకి తోడు గంభీర్(33), యువరాజ్ సింగ్(30) రాణించడంతో సునాయాసంగా గెలుపు సాధించింది. ధోని 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రహానే డకౌటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ట్రెడ్ వెల్ 2 వికెట్లు తీశాడు. ఫిన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌలయింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment