మొహాలి, జనవరి 23: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటూ ధోనిసేన వన్డే సిరీస్లో విజయ ఢంకా మోగించింది. మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలోనూ అలవోకగా నెగ్గి ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1 తో కైవశం చేసుకుంది. ఈ విజయంతో భారత్ నంబర్వన్ ర్యాంక్ పదిలమయింది. నామమాత్రపు ఆఖరి వన్డే ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది. ఈ ఆఖరి మ్యాచ్లో ఓడినా భారత్ నంబర్వన్ ర్యాంక్ పదిలం గానే ఉంటుంది. బుధవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. 258 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 257 పరుగులు చేసింది. రైనాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment