Thursday, January 24, 2013

మళ్ళీ మనమే నెంబర్ వన్...!

మొహాలి, జనవరి 23: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటూ ధోనిసేన వన్డే సిరీస్‌లో విజయ ఢంకా మోగించింది. మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలోనూ అలవోకగా నెగ్గి  ఐదు మ్యాచ్ ల సిరీస్ ను  3-1 తో కైవశం చేసుకుంది.  ఈ విజయంతో భారత్ నంబర్‌వన్ ర్యాంక్ పదిలమయింది. నామమాత్రపు ఆఖరి వన్డే ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో ఓడినా భారత్ నంబర్‌వన్ ర్యాంక్ పదిలం గానే ఉంటుంది.    బుధవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 258 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 257 పరుగులు చేసింది. రైనాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...