హైదరాబాద్, జనవరి 9 : ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన క్వాష్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అక్బరుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. మన దేశంలో చట్టం అందరికీ సమానమేనని కోర్టు తెలిపింది. అక్బరుద్దీన్పై దాడి జరిగినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని మతాలకు చెందినవారు ప్రార్థనలు చేసిన విషయాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసింది. కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అరెస్ట్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఈనెల 22 వరకు రిమాండ్ పై ఆదిలాబద్ జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఆరోగ్యం సరిగా లేనందున తనను హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు లేదా వరంగల్ జైలుకు తరలించాలని అక్బర్ వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. అదిలాబాద్ జిల్లా కేంద్రం జైలులోనే ఉంచి, రిమ్స్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోర్టు అదేశించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment