Saturday, January 5, 2013

రికార్డు స్థాయిలో షిర్డీ ఆదాయం

షిర్డీ,జనవరి 5: మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుని ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. కేవలం 10 రోజుల్లో రూ.13 కోట్లు కానుకల రూపంలో చేకూరాయని సంస్థాన్ వర్గాలు  వెల్లడించాయి. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 మధ్య సాయిని దర్శించుకున్న సుమారు 20 లక్షల మంది భక్తులు ఈ కానుకలు సమర్పించారని తెలిపారు. వీటిలో రూ.35 లక్షల విలువ చేసే బంగారం, వెండి కానుకలు కూడా ఉన్నట్టు చెప్పారు. గతేడాది ఇదే కాలంలో రూ.12.5 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...