Wednesday, January 9, 2013

బడ్జెట్ కు ముందే రైల్వే బాదుడు...

న్యూఢిల్లీ, జనవరి 9 : రైల్వే బడ్జెట్ కు ముందే  రైల్వే చార్జీలు పెరిగాయి. రైల్వేలు నష్టాలలో ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తెలిపారు. 
 అన్ని తరగతులకు 20 శాతం ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఆర్డినరి, సబర్బన్‌లలో కిలోమీటరుకు 2పైసలు, నాన్ సబర్బన్‌లో కిలోమీటరుకు 3పైసలు, స్లీపర్ క్లాస్‌లో కిలోమీటరుకు 6పైసలు, ఏసీ చైర్ కార్ కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు.  పెరిగిన  చార్జీలు ఈనెల 21 అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నట్లు బన్సాల్ తెలిపారు. ప్రతి టికెట్‌పై డెవలప్‌మెంట్ చార్జీ 5 రూపాయలు ఉంటుందని బన్సాల్ అన్నారు. చార్జీల పెంపు అనివార్యమనీ, ఇకపై బడ్జెట్‌లో చార్జీల పెంపు ఉండదని బన్సాల్ తెలియజేశారు. ఈ రైల్వే చార్జీల పెంపుతో కేంద్రానికి రూ. 6,600 కోట్ల ఆదాయం వస్తుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...