న్యూఢిల్లీ, జనవరి 18: రాజకీయ సంక్షోభం నుంచి జార్ఖండ్ బయటపడకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించేందుకే కేంద్రం మొగ్గుచూపింది. ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ జార్ఖండ్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. 82 మంది సభ్యులుగల జార్ఖండ్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ పంపిన నివేదికను కేబినెట్ ఈ భేటీలో ఆమోదించింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) మద్దతు ఉపసంహరించడం వల్ల తన ప్రభుత్వం మైనారిటీలో పడటంతో ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఇటీవల పదవికి రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా గవర్నర్ను కోరిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్లో రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment