Thursday, January 3, 2013

గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురిపై చార్జిషీట్

 న్యూఢిల్లీ, జనవరి 4:  ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఐదుగురిపై సాకేత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఐదుగురిపై హత్య, హత్యాప్రయత్నం, గ్యాంగ్ రేప్, అపహణ, దోపిడీ, సాక్ష్యాల మాయం కింద అభియోగాలు మోపారు. ఆరో నిందితుడిని మైనర్‌గా భావిస్తున్నారు. అతను మైనర్ అయితే విడిగా జువెనైల్ కోర్టులో అతనిపై విచారణ జరుగుతుంది. అతను మైనరా, కాదా  అనే విషయం తెలుసుకోవడానకి ఎముకల పరీక్ష నిర్వహించారు. దాని నివేదిక రావాల్సి ఉంది. అంతకు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ సాకేత్ కోర్టు సముదాయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రారంభించారు. ఈ కోర్టులో విచారణ జరిగే మొదటి కేసు గ్యాంగ్ రేప్ కేసులో ప్రాణాలు విడిచిన నిర్భయదే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...