Thursday, January 3, 2013

పాక్ కు పళ్ళెంలో పెట్టి...

కోల్ కతా, జనవరి 4: ఇక్కడి ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై 85 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ విజయం సాధించింది. మూడు వన్డేల సిరిస్ ను 2 -0 తో పాక్ కైవశం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 250 పరుగులకు  ఆలౌటైంది. ఆ తర్వాత 251 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు 165 పరుగులకు  ఆలౌటైంది. పాక్‌ జట్టులో జంషెడ్‌ 106, హఫీజ్‌ 76, మాలిక్‌ 24 చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, ఇశాంత్‌ 3, భువనేశ్వర్‌, అశ్విన్‌, రైనాకు చెరో వికెట్‌ లభించింది. భారత ఆటగాళ్లలో ధోనీ 54 నాటౌట్‌, సెహ్వాగ్‌ 31, రైనా 18 చేశారు. అజ్మల్‌ 3, జునైద్‌ 3, ఉమర్‌గుల్‌ 2, హఫీజ్‌, మాలిక్‌కు చెరో వికెట్‌ దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...