Wednesday, January 9, 2013

హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు జైలు...

గుంటూరు, జనవరి 9 : కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వున్నం నరేంద్ర హత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కు  పిడుగురాళ్ల మేజ్రిస్టేట్  14 రోజులు రిమాండ్ విధించడంతో  ఆయనను  గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.  శ్రీనివాసరావును  పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.  ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ తనను కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం అక్రమంగా హత్య కేసులో ఇరికించిందన్నారు. పల్నాడు ప్రాంతంలో పార్టీకి అండగా ఉంటుండటంతో రాజకీయంగా అణగదొక్కాలనే దురుద్దేశంతో హత్య కేసులో ఇరికించారన్నారు. ఇటువంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...