Thursday, January 10, 2013

ఇక ' శవ ' బాంబులు...!

న్యూఢిల్లీ,జనవరి 11: మానవ బాంబులతో,  మందుపాతరలతో జనాన్ని చంపడం  మావోయిస్టులకు మొహమ్మొత్తినట్టు ఉంది. శవాలలో బాంబులు పెట్టి  మరణ మృదంగాన్ని మొదలెట్టారీ ముష్కరులు...  జార్ఖండ్‌లోని లాతెహార్ జిల్లాలో ఈనెల 7న మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో పదిమంది జవాన్లు మరణించారు. కానీ, ఆరుగురి మృతదేహాలే లభించాయి. మిగిలిన నలుగురి కోసం గ్రామస్తులతో కలిసి గాలింపు చేపట్టారు. ఆ నాలుగూ బుధవారం సాయంత్రం కనిపించాయి. వాటిని రాంచీకి తరలిస్తుండగా ఒక మృతదేహంలో అమర్చిన బాంబు పేలింది. దాంతో, అక్కడే ఉన్న నలుగురు గ్రామస్తులు మరణించారు. మిగిలిన మూడు మృతదేహాలను హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో అలహాబాద్‌కు చెందిన బాబూలాల్ పటేల్ (29) పొట్ట ఉబ్బెత్తుగా ఉంది. దానిపై కుట్లు ఉన్నాయి. వాటిని చూసిన డాక్టర్లకు అనుమానం వచ్చింది. మృతదేహాన్ని ఆరుబయట ఉంచి ఎక్స్‌రే తీశారు. ఏదో లోహపు వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అందులో అత్యాధునిక పేలుడు పదార్థాలు (ఐఈడీ). ఒక్కొక్కటి కిలోన్నర బరువు ఉంది. ఆ వెంటనే ఢిల్లీ నుంచి ఎన్ఎస్‌జీలోని బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. ఆ బృందం బాంబును నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. . "ఎన్‌కౌంటర్ తర్వాత మృతదేహాలను ఎత్తుకుపోయి,  వాటి పొట్టను చీచి  అందులోని పేగులు, ప్లీహం తదితర అవయవాలను తీసి ఆ ఖాళీలో ప్లాస్టిక్ బాక్సులో కిలోన్నర బరువుండే జిలెటిన్ స్టిక్కులు, డిటోనేటర్, ఒక బ్యాటరీని ఉంచి ప్యాక్ చేశారని, ఆ తర్వాత  కుట్లు వేశారని అని పోలీసులు  వివరించారు. మావోయిస్టుల్లో ఎంతో నైపుణ్యం గల డాక్టర్ ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...