Wednesday, January 2, 2013

రెండేళ్ల గరిష్ట స్థాయికి సెన్సెక్స్...

ముంబై, జనవరి  2: : భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ రెండు సంవత్సరాల గరిష్ట స్థాయిని చేరుకుంది. బుధవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 19756 పాయింట్ల వద్ద ముగిసి.. 2011 జనవరి 6 నాటి స్థాయిని చేరుకుంది. ఇక నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 5993 వద్ద క్లోజైంది. ఓ దశలో నిఫ్టీ 6 వేల మార్కును చేరుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బజాజ్ ఆటో, ఐడీఎఫ్ సీలు అత్యధికంగా మూడు శాతం పైగా లాభపడగా.. జయప్రకాశ్ అసోసియేట్స్, బీపీసీఎల్, మారుతి సుజుకీలు రెండు శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, విప్రో, పవర్ గ్రిడ్, ఐటీసీ, కోల్ ఇండియాలు స్వల్ప నష్టాల్లో ముగిసాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...