హైదరాబాద్,డిసెంబర్ 8 : రాజ్యసభలో ఎఫ్ డీఐలపై ఓటింగ్ కు ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరు పై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వారి నుంచి వివరణ కోరారు. రాజ్యసభలో శుక్రవారం నాడు ఎఫ్డీఐపై ఓటింగ్కు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి,గుండు సుధారాణి, దేవేందర్ గౌడ్ లు గైర్హాజరు అయిన విషయం తెలిసిందే. వీరు ఢిల్లీలోనే ఉండి కూడా సభకు హాజరు కాలేదు.మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకంలో 51 శాతం ఎఫ్డీఐలకు రాజ్యసభలో కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేయించుకుంది, మొత్తంమీద 244 మంది సభ్యుల్లో 225 మంది ఓటింగ్లో పాల్గొన్నట్టు రాజ్యసభ అధికారులు ప్రకటించారు. తీర్మానాన్ని ఓడించేందుకు యూపీఏకు 116 ఓట్లు కావాల్సి ఉండగా 123 లభించాయి. సమాజ్వాదీ 9 మందీ వాకౌట్ చేశారు. మొత్తంమీద 19 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు.విపక్షాల తరఫున అన్నాడీఎంకే సభ్యుడు వి.మైత్రేయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 102 ఓట్లు రాగా, వ్యతిరేకిస్తూ 123 ఓట్లు పడ్డాయి. విపక్షాల ఎఫ్డీఐ వ్యతిరేక తీర్మానం లోక్సభలో కూడా గత బుధవారం వీగిపోవడం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment