కోల్కతా,డిసెంబర్ 9: ఈడెన్గార్డెన్స్లో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు గంభీర్ (104 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్సర్), సెహ్వాగ్ (57 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించినా... మిడిలార్డర్ కుదేలవడంతో ఒకే సెషన్లో 36 పరుగుల వ్యవధిలో ఆరు ప్రధాన వికెట్లు కోల్పోయింది. అశ్విన్ కాస్త దూకుడు గా (151 బంతుల్లో 83 బ్యాటింగ్; 13 ఫోర్లు) ఆడటంతో ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం నుంచి భారత్ బయపడింది. అశ్విన్తో పాటు ఓజా (21 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు వికెట్లు తీసుకోగా... అండర్సన్, స్వాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 167.3 ఓవర్లలో 523 పరుగులకు ఆలౌటయింది. ఓజా నాలుగు, అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 207 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భారత్ 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment